ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తప్పుడు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ మొబైల్ నెంబర్ ను తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కు ఓ సందేశం ద్వారా తప్పుడు పిన్ నెంబర్ పంపుతారని, పొరబాటున కూడా దాన్ని ఎంటర్ చేయొద్దని స్పష్టం చేసింది. వాట్సాప్ ఖాతా వెరిఫికేషన్ పేరిట మోసానికి తెరలేపుతారని, వారు పంపిన 6 అంకెల పిన్ నెంబర్ ఎంటర్ చేయమని కోరతారని తెలిపింది. ఒక్కసారి ఆ నెంబర్ ను ఎంటర్ చేస్తే యూజర్ల ఖాతా వివరాలన్నీ హ్యాకర్ల చేతికి వెళతాయని వాట్సాప్ వెల్లడించింది.
ఇలాంటి తప్పుడు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పైగా ఈ సందేశాన్ని ఇతరులకు కూడా షేర్ చేయాలని సూచిస్తుంటారని పేర్కొంది. తాము యూజర్లను ఎప్పుడూ వెరిఫికేషన్ గురించి అడగబోమని, యూజర్లకు తాము పంపే సందేశాలు బ్లూ టిక్ ఉన్న ఖాతా నుంచే వస్తాయని వాట్సాప్ నిపుణుల బృందం వెల్లడించింది.
జగన్ వస్తే అవినీతిని సమర్థించినట్టే: భట్టి విక్రమార్క