తెలంగాణ మొత్తం దుబ్బాక ఫలితాలపైనే దృష్టిపెట్టాలి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికీ రెండో స్థానం వస్తుందో అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. అయితే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా అందులో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. కానీ మొదటి రౌండ్ కౌంటింగ్ లో అనూహ్యంగా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మొదటి రౌండ్ నుంచి ఐదో రౌండ్ వరకు బీజేపీ అధిక్యంలోనే ఉంది. ఇక ఆరో రౌండ్లో మాత్రం తెరాసకు ఆధిక్యం లభించింది. ఆరో రౌండ్లో తెరాసకు 353 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ కి షాక్ ఇచ్చింది. 6 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,667 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 6 రౌండ్లు ముగిసేసరికి భాజపా-20,226, తెరాస-17,559, కాంగ్రెస్-3,254 ఓట్లు వచ్చాయి. 6 రౌండ్లలో దుబ్బాక మండలం, పురపాలక సంఘంలోని ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. కాగా.. కౌంటింగ్లో భాగంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ టేబుళ్లపై 23 రౌండ్ల పాటు ఈవీఎంలను లెక్కిస్తారు. దుబ్బాక నియోజకవర్గంలోని 315 పోలింగ్ కేంద్రాల్లో 1,64,192 ఓట్లు పోలయ్యాయి.
previous post
next post