telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

శర్వానంద్ ”శ్రీకారం”ను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి…

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వచ్చిన సినిమా ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కిశోర్‌ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ నెల 11 న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్న… మూవీ క్రిటిక్స్ నుండి మాత్రం ప్రశంసలు పొందింది. ఇక తాజాగా ఈ సినిమాను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రశసించారు. తన ట్విట్టర్ వేదికగా.. వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం.” అని ట్విట్ చేసారు.

Related posts