telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

లోకేష్ చేతిలో ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా : శివప్రసాద్

lokesh tdp

ఏపీలో ప్రస్తుతం నందం సుబ్బయ్య హత్యపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.  సుబ్బయ్య హత్యతో ఎమ్మెల్యే  శివప్రసాద్ రెడ్డికి సంబంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు సమాధానంగా  టీడీపీ నేత సుబ్బయ్య హత్యతో సంబంధం లేదన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి  చౌడేశ్వరి దేవి పాదాల మీద ప్రమాణం చేశారు.  సుబ్బయ్య కుటుంబానికి తన  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టీడీపీ శవ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. సుబ్బయ్య హత్యతో తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేదన్న ఆయన.., సుబ్బయ్యను హత్య చేశానని లోకేష్ తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో  100 కోట్లు ఖర్చు పెట్టినా లోకేష్ ఓడిపోయారని అన్నారు. తాను రాజీనామా చేస్తా.. ప్రొద్దుటూరులో లోకేష్ పోటీ చేసి గెలవాలని అన్నారు. లోకేష్ గెలిస్తే రాజకీయాలను నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి. లోకేష్ చేతిలో  చేతిలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించి ఊరు వదిలి వెళ్ళిపోతానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. నాటుసారా కేసులో ముద్దాయి అయిన  సుబ్బయ్య కోసం నారా లోకేష్ నాయుడు రావడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు. చూడాలి మరి ఈ వివాదాలు ఇంకా ఎంత దూరం వెళ్తాయి అనేది.

Related posts