telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు సెక్రటేరియట్ కు జగన్..పోలీసుల పటిష్ట చర్యలు

jagan

ఏపీ సీఎం జగన్ నేడు అమరావతిలోని సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో, సీఎం ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మందడంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రతి ఇంటి వద్ద పోలీసులు నిలబడ్డారు.

మరోవైపు రాజధానిని తరలించరాదని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల శిబిరం వద్ద ఎవరూ రోడ్డుపైకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కొత్త శిబిరంలో ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పాత శిబిరంలోనే నిరసనలు కొనసాగించాలని రైతులకు పోలీసులు సూచించారు. 

Related posts