విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా శ్వేతను ఆ పార్టీ అధినేత చంద్రబాబు బరిలోకి దింపారు. ఈ మేరకు టీడీపీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేసింది.
కేశినేని నాని రెండో కుమార్తె శ్వేత. గత రెండు లోక్ సభ ఎన్నికల్లో తన తండ్రి తరపున శ్వేత విస్తృతంగా ప్రచారం చేశారు. గత అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరపున కూడా ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. హిల్లరీ గెలుపు కోసం ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు.
బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్: మాజీ ఎంపీ హర్షకుమార్