గొదావరిలొ జరిగిన బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్ వేశానని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోటు ప్రమాదంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాను ఏ తప్పూ చేయకున్నప్పటికీ తనను జైలులో పెట్టినందుకు గర్వపడుతున్నానని అన్నారు.
డిసెంబర్ 13న అరెస్టయి రిమాండ్ మేరకు జైలులో ఉన్న ఆయన ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తాను ప్రభుత్వ అధికారులను దూషించలేదన్నారు. 28 రోజుల వరకు పోలీసులు తనకు రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిగా విశాఖను ప్రకటించడాన్ని హర్షకుమార్ తప్పుబట్టారు. రాజధాని పేరుతో విశాఖను పాడుచేయవద్దన్నారు.