telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇకపై పార్టీ డిసైడ్ చేసిన వారే టీవీ చర్చలకు వెళ్ళాలి: కేసీఆర్

Woman candidates kcr cabinet Telangana

ఇకపై పార్టీ డిసైడ్ చేసిన వారే టీవీ చర్చలకు వెళ్లాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. వారు కాకుండా ఎవరైనా వెళ్తే మాత్రం బాగోదని పార్టీ నేతలకు హితవు పలికారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కేసీఆర్ పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో అన్ని వర్గాలను కలుపుకుపోవాలన్నారు. మనకు ఎవరు పోటీ లేరని మీరు ముందుకెళ్లండని నేతలకు కేసీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ విమర్శలను పట్టించుకోవద్దని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. మరో రెండు రోజుల్లో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్ననట్లు ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు.

Related posts