లాక్ డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్యాసింజర్, మెయిల్, ఎక్స్ప్రెస్, సబర్బన్ వంటి అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. లాక్డౌన్ ప్రత్యేక రైళ్లు, శ్రామిక్ రైళ్లు మాత్రమే నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. మిగిలిన ప్రయాణీకుల రైళ్లు తిరగవని స్పష్టం చేసింది.
ఆన్లైన్ లేక రైల్వే కౌంటర్లలో ఇప్పటికే ప్రయాణికులు రిజర్వేషన్లు చేయిస్తే ఛార్జీలు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఆన్లైన్లో చెల్లించిన ప్రయాణికుల ఖాతాలకు తిరిగి ఆ డబ్బును జమ చేస్తున్నట్లు వివరించింది.కౌంటర్లలో రిజర్వేషన్లు చేయించిన వారికి కూడా ఆన్లైన్లోని పలు రూపాల్లో డబ్బులు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 12 నుంచి కార్మికుల కోసం ప్రారంభమైన ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతామని వెల్లడించింది.