వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో స్పీడ్ పెంచాలని సీబీఐ బృందం నిర్ణయించింది. అందుకే ఇవాళ కీలక వ్యక్తులను విచారించనుంది. గతంలోనూ విచారణ కోసం సీబీఐ అధికారులు కడపకు వచ్చారు. ఇప్పుడు మరోసారి రావడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన తండ్రి మృతిపై సీబీఐ విచారణ వేగవంతం చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత డిమాండ్ చేశారు. తన తండ్రిని హత్య చేశారని, దీని వెనక రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. హత్య జరిగి రెండేళ్లయినా ఎవరు చేశారనేది ఇప్పటివరకు తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం దర్యాప్తు సాగుతోందని ఈ మధ్యలో సాక్షులకు ఏమైనా అవుతుందేమోననే భయంతో ఉన్నానని చెప్పారు. ఇక, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తనకు అనుమానం ఉన్న 15 మంది పేర్లు రాసినట్లు తెలిపారు. ఇప్పటివరకు చార్జిషీటు దాఖలు చేయలేదని, అరెస్టులు కూడా చేయలేదని చెప్పారు. ఎంత కష్టమైనా నిందితుల్ని పట్టుకునే వరకు పోరాడతానని సునీత చెప్పారు. సునీత ఢిల్లీ పర్యటన వివేకా హత్య కేసును మళ్లీ తట్టి లేపినట్లయింది.
previous post
next post
ఆదాయానిచ్చే హైదరాబాద్ ఏపీకి లేకుండా పోయింది: జగన్