telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చిక్కుకున్న వారిని ఆదుకోవాలని.. గుజరాత్ సీఎంకు జగన్ ఫోన్

గుజరాత్ లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం జగన్ ఫోన్ చేశారు. బతుకుదెరువుకోసం కోసం గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న జాలరులకు సాయం చేయాలని లేఖలో విజ్జ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి , అక్కడి తెలుగు మత్స్యకారుల ప్రస్తావన తెచ్చారు.

ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని ఏపీ సీఎం వైయస్ జగన్ ఫోన్ కు గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ సానుకూలంగా స్పందించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా ఆదుకుంటామని ట్వీట్ చేశారు.

Related posts