telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బెంగళూరు : .. నిమజ్జనంలో అపశృతి .. 6 పిల్లలు మృతి..

6 children died in ganesh utsav bangalore

వినాయక నవరాత్రులు పూర్తికావడంతో నేడు దేశవ్యాప్తగా వినాయక నిమజ్జనం ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాన్ని చూడటానికి, పాల్గొనటానికి వయోభేదం లేకుండా అందరూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో బెంగుళూరు లో ని ఉత్సవాలలో అపశ్రుతి చోటు చేసుకుంది. కోలార్‌ జిల్లా క్యేశంబల్లా సమీపంలోని మరదాగుట్ట గ్రామంలో నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న ఆరుగురు చిన్నారులు మృతి చెందారు.

నిమజ్జనం సమయంలో ప్రమాదవశాత్తు వీరు నీటి కుంటలో పడి వీరు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. మరదాగుట్టకు చెందిన తేజస్వి, రక్షిత, రోహిత్‌, వైష్ణవి, ధనుష్‌, వీణ మృతి చెందారు. తొలుత ముగ్గురు పిల్లలు కుంటలో పడిపోగా వారిని కాపాడేందుకు మరో ముగ్గురు నీటి కుంటలో దిగారు. నీటిలో మునిగి ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

Related posts