పేదలకు అందించాల్సిన మిగులు బియ్యంతో శానిటైజర్లు తయారుచేస్తున్నారని వస్తున్న కథనాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఓవైపు పేదవాళ్లు ఆకలితో చచ్చిపోతుటే బియ్యంతో శానిటైజర్లు తయారుచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. బియ్యాన్ని శానిటైజర్ల తయారీకి అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వచ్చిన కథనాన్ని కూడా రాహుల్ తన ట్వీట్ కు జోడించారు
“భారతదేశంలో పేదవాళ్లు ఎప్పుడు మేల్కొంటారు? ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “మీరు ఆకలితో అలమటిస్తుంటే, మీకు దక్కాల్సిన బియ్యంతో శానిటైజర్లు తయారుచేసి సంపన్నుల చేతులు శుభ్రపరచాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు” అంటూ ట్విట్టర్ లో రాహులు పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు: ఉత్తమ్