telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న శిద్దా

sidda raghava rao

ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సఫలీకృతమవుతోంది. టీడీపీ నేతలు ఒకొక్కరూ వైసీపీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కుమారుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో భారీ షాక్ తగలబోతోంది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తన కుమారుడితో కలిసి రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు.

శిద్దా రాఘవరావు ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మాగుంట చేతిలో ఓడిపోయారు. ఇప్పటికే శిద్దా సోదరులు వైసీపీలో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే శిద్దా పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. రేపు ఆయన వైసీపీ తీర్థం పుచ్కుకో నున్నారు.

Related posts