కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేదీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. యూపీలోని మధురలో తన వ్యతిరేకులను పార్టీలోకి చేర్చుకోవడంపై ఆగ్రహించిన ప్రియాంక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సొంతపార్టీపైనే ఫైర్ అయిన ప్రియాంక ఊహించినట్టుగా గత రాత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు గాలి బ్యాచ్కు ప్రోత్సాహం ఇస్తోందంటూ చతుర్వేది వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ మేరకు ఆమె రాహుల్ గాంధీకి లేఖ రాశారు. మరోవైపు తన ట్విటర్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ట్యాగ్ను తీసివేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. ప్రియాంకా చతుర్వేదీ త్వరలోనే తమ పార్టీలో చేరుతారని ప్రకటించారు. ఈరోజు పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఆమె శివసేన తీర్థం పుచ్చుకొనున్నారు.