రాష్ర్టానికి రావాల్సిన రూ. 2,641 కోట్ల ఐజీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. ఐజీఎస్టీ బకాయిల పరిష్కారంపై మంత్రుల బృందం సమావేశం నిర్వహించారు. ఐజీఎస్టీ కన్వీనర్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
బీఆర్కే భవన్ నుంచి రాష్ర్ట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 5న జరిగే జీఎస్టీ మండలి భేటికి ముందే ఈ నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కొవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రాష్ర్టాలకు ఐజీఎస్టీ నిధులు వస్తే ఊరట కలుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణకు రూ. 2,638 కోట్ల ఐజీఎస్టీ చెల్లించాలని జీఎస్టీ కౌన్సిల్ తెలిపింది.