మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఉద్దవ్ అన్నారు.
హర్యానా, బీహార్లో వ్యవహరించిన తీరుగానే ఇక్కడ కూడా ఎత్తులు వేసిందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇంతకుముందు ఈవీఎం ఆటలు ఆడేవారని, ఇప్పుడు కొత్త ఆట ఆడుతున్నారన్నారు. బీజేపీకి ప్రతిపక్షాలు, స్నేహితులు వద్దు అని అన్నారు. ప్రజాస్వామంతో పిల్లల ఆట ఆడడం సరికాదని వ్యాఖ్యానించారు. బీజేపీ చేసింది కేవలం రాజకీయ సర్జికల్ స్ట్రయిక్ మాత్రమే అని అన్నారు.