దక్షిణ ఇటలీలోని ఓ సర్కస్లో ట్రైనర్పై పులులు దాడి చేసి చంపేసిన విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన ట్రిగ్గియానోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పుగ్లియాలో గురువారం చోటుచేసుకుంది. ఏట్టోర్ వెబర్ అనే 61 ఏళ్ళ ట్రైనర్పై మొదట ఓ పులి దాడి చేసింది. అది గమనించిన మిగతా మూడు పులులు కూడా వెబర్పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాయిదాడికి తెగబడ్డాయి. ఒక్కసారిగా నాలుగు పులులు మీద పడడంతో బాధితుడు వాటిని ఎదిరించలేకపోయాడు. సర్కస్ సిబ్బంది వాటిని భయపెట్టేందుకు యత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధులు వచ్చేలోపు వెబర్ చనిపోయాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెబర్ బాడీని ఆ నాలుగు పులులు ఎక్కడికక్కడ చీల్చేశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలు (20 యూరోప్ దేశాలతో కలిపి) సర్కస్ ప్రదర్శనలో క్రూర జంతువులను వినియోగించడాన్ని నిషేధించాయి. బ్రిటన్ కూడా వచ్చే ఏడాది నుంచి ఈ నిషేధాన్ని అమలు చేయనుంది.