ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి త్వరలో విదేశాలకు కార్గో విమానాలు నడుస్తాయని టీడీపీ ఎంపీ మురళీమోహన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన పోటీపై పార్టీదే తుది నిర్ణయమని, అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని మురళీమోహన్ స్పష్టం చేశారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కడియం సమీపంలోని వేమగిరిలో 10.77 ఎకరాల్లో రూ.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతీయ కేంద్రాన్నిఏర్పాటు చేస్తామని అన్నారు. కడియం వంగడాలను ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
రేపు తూర్పుగోదావరి జిల్లా కడియంలో జాతీయ పూల పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన జరగనున్నట్లు చెప్పారు. పూణెలోని డైరక్టరేట్ ఆఫ్ ఫ్లోరీకల్చరల్ అనుబంధ విభాగాన్ని.. కడియం నర్సరీల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రానికి రేపు శంకుస్థాపన చేస్తామని ఆయన వెల్లడించారు. పూణే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరీకల్చర్ కి అనుబంధంగా ఈ కేంద్రం పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రోజావి పగటి కలలు: టీడీపీ ఎమ్మెల్యే అనిత