telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్ లో ఉచిత నీటి పథకానికి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం…

గ్రేటర్ పరిధిలో ఉచిత నీటి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకానికి  ఆధార్ కార్డును ప్రామాణికంగా పేర్కొన్నారు. బస్తీలలో మాత్రం నల్లాలకు మీటర్లు లేకున్నాడాకెట్ ఆధారంగా బిల్లు వసూలు చేయనున్నారు. అపార్టుమెంట్లలో మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించారు. సిటీలో ఉన్న స్లమ్.. బస్తీ ఏరియాలో ఉన్న నల్లా కనెక్షన్లకు ఇకపై ఎలాంటి బిల్లు ఉండదని కూడా పేర్కొన్నారు. వినియోగదారులు ప్రత్యేకంగా ఎలాంటి మీటర్లను బిగించుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన డొమెస్టిక్ యూజర్లు 20వేల ఫ్రీ వాటర్ పొందేందుకు తప్పనిసరిగా మీటర్ ఉండాల్సిందేనని నిబంధనలలో పేర్కొన్నారు. దీనికోసం సొంత ఖర్చులతోనే బిగించుకోవాలని కూడా పేర్కొన్నారు. మీటర్ రీడింగ్ ప్రకారం నెలలో 20వేల లీటర్లు దాటితే ప్రస్తుతం చెల్లిస్తున్న టారీఫ్ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుందని, అపార్టుమెంట్లలోని ప్లాట్ల లెక్కన ఒక్కో ఫ్లాటుకు 20వేల లీటర్ల చొప్పున మొత్తం ఫ్లాట్లకు జలమండలి మంచినీళ్లు అందించనుంది. పది ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంట్ కు 2లక్షల నీటిని ఉచితంగా సరఫరా చేసి… అంతకు మించిన నీటికి పాత టారీఫ్ లెక్కన బిల్లు వసూల్ చేయాలని నిర్ణయించుకున్నారు.

Related posts