telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

అనంతపురంలో ట్రాక్టర్ బోల్తా.. నలుగురు దుర్మరణం

Accident

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. జిల్లాలోని కదిరి నియోజకవర్గం నంబులపూలకుంటలో బుధవారం సోలార్ పవర్ ప్లాంట్‌లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts