telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

పెరిగిన బంగారం ధరలు…

Gold rates hike

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ కూడాపెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటిన బంగారం ఇప్పుడు మొదటిసారి కిందకి దిగ్గి వచ్చింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 53,510 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 49,060 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 పెరిగి రూ.49,800కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 పెరిగి రూ.45,650 పలుకుతోంది. ఇక కిలో వెండి కూడా 700 పెరిగి ధర రూ.70,700కు చేరింది

Related posts