ఏపీ సీఎం జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. బడ్జెట్ తీర్మానానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ఈ భేటీ తర్వాత శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి వీడియో కాల్ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగించనున్నారు.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే ప్రవేశపెట్టి ఓటాన్ అకౌంట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జులై నుంచి రాబోయే తొమ్మిది నెలల కాలం కోసం పూర్తిస్థాయి బడ్జెట్ ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.