మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని తక్కువ అంచనా వేయవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జ్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు, మేడ్చల్ జిల్లాలోని మున్సిపాల్టీల్లో అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.
బీజేపీ ఒక్క మున్సిపాల్టీ గెలిచినా కాలర్ ఎగరేసే పరిస్థితి ఎదురవుతుందని కేటీఆర్ చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని ఆదేశించారు. సభ్యత్వ నమోదులో గజ్వేల్, పాలకుర్తి నియోజకవర్గాలు మొదటి స్థానంలో ఉన్నాయని తెలిపారు. సభ్యత్వ రుసుము ద్వారా పార్టీ ఖాతాలో రూ.14 కోట్లు జమ అయిందని వెల్లడించారు. ఈ నెల 30 వరకు సభ్యత్వ నమోదు.. తర్వాత కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.