telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. కర్రలతో పోలీసులపై దాడి

Parents Murdered Daughter at Mancherial

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకున్నందుకు పోలీస్ అధికారులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా, పలువురికి గాయాలయ్యాయి. జమ్మలమడుగు శివారులో ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తున్నట్లు ఈరోజు పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే అప్రమత్తమై అధికారులు అక్కడికి వెళ్లగా, ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా సభ్యుడు ట్రాక్టర్లలోని కర్రలు, పారలతో దాడికి దిగారు. ఈ ఘటనలో వీరాంజనేయులు అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి చేసిన అనంతరం ఇసుక మాఫియా సభ్యులు ఘటనాస్థలం నుంచి పారిపోయారు.

Related posts