telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వేళ చంద్రబాబు, లోకేశ్ పారిపోయారు: రోజా

roja ycp mla

కరోనా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ప్రజలకు దగ్గరుండి భరోసా కల్పించాల్సిన మాజీ సీఎం చంద్రబాబు, తన కుమారుడు లోకేశ్ తో కలిసి పక్క రాష్ట్రానికి పారిపోయారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆమె, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆమే మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ ఓ దద్దమ్మని అభివర్ణించారు. పనీపాటా లేని లోకేశ్, తిన్నది అరగక అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటుంట, వారిని పరామర్శించేందుకు చంద్రబాబు, లోకేశ్ పరిగెత్తుకుంటూ ఏపీకి వచ్చారని ఆరోపించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది వ్యవధిలోనే ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారని, కరోనా విషయంలోనూ ఎంతో ముందుచూపుతో వ్యవహరించారని అన్నారు. ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తూ, వైద్యాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. కరోనా కట్టడి విషయంలో మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని రోజా పేర్కొన్నారు.

Related posts