telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మేధావులు టీఆర్‌ఎస్‌కి బుద్ది చెప్పాలి.. లేకుంటే తెలంగాణ అన్యాయం అయిపోతుంది

మేధావులు టీఆర్‌ఎస్‌ కి బుద్ది చెప్పాలి.. లేకుంటే తెలంగాణ అన్యాయం అయి పోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… మళ్ళీ గుర్రంపోడు తండా వెళ్తామని.. అంతే కాదు పెరేడ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో అక్కడికి వచ్చి చేసుకోవాలని సవాల్‌ విసిరారు. సీఎం వస్తాడో, ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు వస్తాడో రావాలని, ఎంత మందిని గుర్తించి అరెస్ట్ చేస్తారో చేసుకోమ్మని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌. నాగార్జున సాగర్ లో ఈ నెలలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని… నాగార్జున సాగర్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని పేర్కొన్నారు. రెండు ఎమ్మెల్సీలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని జిల్లాలలో ముఖ్య నేతలందరం ప్రచారం చేస్తామని తెలిపారు. 25 మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్ ని పెట్టామన్నారు బండి సంజయ్.

Related posts