telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీ నేతలను నల్లుల్ని నలిపినట్టు నలిపేస్తాం : కొడాలి నాని

kodali nani ycp

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎప్పుడు వివాదాల్లో ఉండే నాయకులు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా…టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తుంటారు. ఆయన కామెంట్స్ చేసాడంటే కచ్చితంగా అవి వివాదస్పదంగానే ఉంటాయి. తాజాగా మరోసారి చంద్రబాబు, టీడీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనను చూసి… చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడం లేదని ఫైర్ అయ్యారు. పేదలకు ఇళ్ళు ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు దోచుకున్నారని.. కేంద్రం ఇచ్చిన సబ్సిడీ డబ్బులను కూడా ఈ దొంగలు దోచేశారని ఆరోపణలు చేశారు నాని. చంద్రబాబు, అతని అనుచరులను జగన్నాధ రథ చక్రాల కింద నల్లిని నలిపినట్లు నలిపేస్తామని కొడాలి నాని అన్నారు.గుడివాడలో 25 వేల మంది లబ్ధిదారులకు.. 2024 లోపు ఇళ్ళు కట్టించి ఎన్నికల్లో పోటీ చేయనని నాని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు కావాలనే వైసీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Related posts