సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో బ్లాక్బస్టర్ హిట్టందుకుంది. ముఖ్యంగా నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను ఈ చిత్రం క్రియేట్ చేస్తోంది. 16 రోజులకు గానూ ఈ చిత్రం ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 113.04 కోట్ల షేర్ రాబట్టినట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్గా ఒరిజినల్ కలెక్షన్స్ అంటూ విడుదల చేసింది. వారు విడుదల చేసిన కలెక్షన్స్ కోట్లలో (షేర్) :
నైజాం: 38.20
సీడేడ్: 15.66
ఉత్తరాంధ్ర: 19.25
తూర్పు గోదావరి: 10.86
పశ్చిమ గోదావరి: 7.10
గుంటూరు: 9.50
కృష్ణా: 8.52
నెల్లూరు: 3.95
టోటల్ ఏపీ, తెలంగాణ షేర్: 113.04 కోట్లు