మాల్దీవులంటే… ఎవరికి ఇష్టం ఉండదు. ఆ అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరాలని అందరూ భావిస్తారు. అయితే చాలామంది సెలెబ్రిటీలు మాత్రం తమకు టైం దొరికిందంటే చాలు తమకు ఇష్టమైన ప్రాంతంలో చక్కర్లు కొడుతుంటారు. చాలామంది సెలెబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ఇటీవల భర్త గౌతమ్తో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వారు తీసుకున్న పోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్, సమంత కూడా మాల్దీవులో దర్శనమిచారు. ఇక తాజాగా కోలీవుడ్ ప్రేమ జంట విష్ణు విశాల్, గుత్తా జ్వాల మాల్దీవుల్లో విహరిస్తున్నారు. మాల్దీవుల్లో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా తో కలిసి విష్ణు విశాల్ ఎంజాయ్ చేస్తుండగా, వాటికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టడం తో పాటు నిశ్చితార్ధం కూడా జరుపుకున్నారు. ఏయితే వీరి పెళ్ళిపై ఇంకా క్లారిటీ రాలేదు.
previous post