మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన చిత్రం ‘ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజాగా ఏప్రిల్ 12న ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే అభిమానులకు మెగా విందు పక్కా అనిపిస్తోంది.
రామ్ చరణ్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ధర్మస్థలి.. అపధర్మస్థలి ఎలా అవుతది ?, పాదఘట్టం వాళ్ల గుండెలపై కాలు వేస్తే.. ఆ కాలు తీసేయాలట.. వంటి డైలాగ్లు ఆకట్టుకున్నాయి.
కొన్ని సన్నివేశాల్లో వింటేజ్ మెగాస్టార్ స్పష్టంగా కనిపిస్తున్నారు. కూర్చులో కూర్చుని సోనూ సూద్ కి వార్నింగ్ ఇస్తున్న సన్నివేశం అయితే ట్రైలర్ లో అదుర్స్ అనే చెప్పాలి.
చివరలో “సిద్ధా తెలుసా మీకు…” అంటూ తనికెళ్ళ భరణి, చిరంజీవిని ప్రశ్నించగానే “కామ్రేడ్…” అంటూ పిలుపు వినిపిస్తుంది. ముందుగా చెప్పుకున్నట్లుగా సినిమా మొత్తం దేవాలయాలు, నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు కనిపిస్తోంది. ఆ తరువాత చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కామ్రేడ్స్ డ్రెస్ లో కనిపించే విజువల్స్ అభిమానులకు కన్నుల పండుగ కలిగించక మానదు.
ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో పెన్ స్టూడియోస్ ఆధ్వర్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.