ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్భట్ గుండెపోటుతో మృతి చెందారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అతని కుమార్తె పూజా భట్ స్పందిస్తూ వాటికి ఫుల్స్టాప్ పెట్టారు. ఒక ట్వీట్లో ఆమె మహేష్భట్కు సంబంధించిన ఒక ఫొటోను షేర్చేస్తూ వివరాలు వెల్లడించారు. అంతేకాకుండా ఇలా వదంతులు వ్యాప్తి చేస్తున్న వారికి సమాధానం చెప్పారు. “వదంతులు వ్యాప్తి చేసేవారు, నా తండ్రి మహేష్ భట్ హార్ట్అటాక్తో మృతి చెందారనే వార్త విని కలత చెందుతున్న వారికి ఇదే సాక్ష్యం. ఆయన ఎప్పటి మాదిరిగానే ఉన్నారు. ఉత్సాహంగా జీవిస్తున్నారు” అంటూ మహేష్ భట్ క్షేమంగానే ఉన్నారనే సమాచారాన్ని తెలియజేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ప్రస్తుతం మహేష్భట్ ‘సడక్-2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 1991లో వచ్చిన ‘సడక్’ సినిమాకు సీక్వెల్. దీనిని రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందించారు. అయితే సీనియర్ దర్శకనిర్మాతలు, నటీనటులపై ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేయడం అనేది బాధాకరమైన విషయం.
previous post
next post