దేశసేవలో నేలకొరిగిన
ధీర జవానులారా…
పిరికి పందల కుటిల చర్యకు
రుధిరం చిందిన వీరులారా…
మతోన్మాదం మంటలల్లో
మండిపోయిన భారతజాతి బిడ్డలారా..
అమ్మ ఒడిలో నిద్ర కోసం అవని కెగిసిన చుక్కలారా..
మరువలేని సేవచూపి మాయమైన సైనికులారా…
మాటలు రాని భారతమాత మౌనంగా రోధిస్తుంది ..
కుటిల బుద్ధితో కొట్టిన దెబ్బను
సహనంగానే చూస్తుంది…
అమరవీరుల త్యాగాలను
తన పొత్తిళ్లలో దాచుకుంటుంది..
భారతావనిలో గడ్డి పోచలై
గడ్డ పారలై కదం తొక్కాలి…
కధనరంగంలో దూకాలి..
పిరికి చర్యల పాకిస్థానులా
గుండెలు చీల్చి చెండాడాలి..
–దూడపాక శ్రీధర్, మంథని జిల్లా