telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ పెయింటింగ్ చూసి సుశాంత్ భయంతో వణుకుతూ మంత్రాలు… : రియా

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులోని ట్విస్టులు సస్పెన్సు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. తాజాగా సుశాంత్ మాజీ మేనేజ‌ర్‌ శృతి మోదీని కూడా ఈడీ విచారించింది. రెండోసారి కూడా ఈడీ విచారణకు శ్రుతీ మోదీ హాజరై పలు విషయాలను వెల్లడించారు. కాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా ఇటీవలే ఈడీ ఎదుట విచారణకు హాజరైంది. సుశాంత్‌ సున్నిత మనస్కుడు, భయస్తుడని రియా చక్రవర్తి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. గత ఏడాది అక్టోబరులో సుశాంత్‌తో కలిసి తాను యూరప్‌కు వెళ్లానన్నారు. ఓ హోటల్‌లో స్పానిష్‌ చిత్రకారుడు ఫ్రాన్సిస్కో గోయా వేసిన ‘సాటర్న్‌ డెవోరింగ్‌ హిస్‌ ఓన్‌ సన్‌’ అనే పెయింటింగ్‌ చూసి సుశాంత్‌ భయంతో వణికిపోయాడని చెప్పారు. అప్పుడు తాను సోదురుడితో కలిసి వేరే గదిలో ఉన్నానని వివరించారు. సుశాంత్‌ గదికి వచ్చేసరికి భయంతో వణుకుతూ మంత్రాలు జపిస్తున్నాడని రియా ఈడీ ఎదుట పేర్కొన్నారు. పిల్లలు తన రాజ్యాధికారాన్ని లాక్కుంటారేమోనన్న భయంతో కన్న తండ్రి సొంత బిడ్డలను ఒక్కొక్కరినీ సజీవంగా పీక్కు తింటుండటం ‘సాటర్న్‌ డెవోరింగ్‌ హిస్‌ ఓన్‌ సన్‌’ పెయింటింగ్‌ ప్రధాన ఇతివృత్తం. సుశాంత్ కు సబీనాదించిన రోజుకో వార్త ఇలా బయటకు వస్తూనే ఉంది. మరి సుశాంత్ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.

Related posts