telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యుద్ధం దుబ్బాక నుండి మొదలైంది : ఎంపీ సోయం బాపురావు

soyam bapu rao

దుబ్బాక నియోజకవర్గం కాసులాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. రామలింగా రెడ్డి మానసిక క్షోభ తో చనిపోయాడని..సీపీ టీఆర్ఎస్ కార్యకర్త, అతని సంగతి ఎన్నికల తర్వాత చెప్తామని హెచ్చరించారు. అందుకే ఇక్కడికి ఎవరిని తేవాలో వారిని తెచ్చామని..సీపీ ఎమ్మెల్యే అవుదాము అనుకుంటున్నాడా ? వార్డ్ నెంబర్ కూడా కాలేడని ఫైర్ అయ్యారు. రామలింగారెడ్డి కొడుకును ఎందుకు దాచి పెట్టారని..ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలని మండిపడ్డారు. దుబ్బాక నిర్లక్ష్యానికి ఎందుకు గురి అయిందని..యుద్ధం దుబ్బాక నుండి స్టార్ట్ అయిందని పేర్కొన్నారు. ఆరు నెలలు పాప , మహిళలు అని చూడకుండా అధికారులు ప్రవర్తించారని..కలెక్టర్ ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాడని ఫైర్ అయ్యారు. సీపీ ని చూసి పోలీస్ ఉద్యోగమే వద్దు అనుకుంటున్నారు. సీపీ ని చూసి పోలీస్ అమరులు ఆత్మ క్షోభిస్తుందని..నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసే వాళ్ళు బీజేపీ నాయకులు అని తెలిపారు.

Related posts