telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు యడియూరప్ప బలపరీక్ష.. స్పీకర్ రమేష్ రాజీనామా!

karnataka speaker disqualified two rebels

నేడు కర్ణాటక నూతన సీఎం యడియూరప్ప శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ క్రమంలో స్పీకర్ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడు రాజీనామా చేయాలన్న నిర్ణయంతోనే నిన్న 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి కూలిపోయెందుకు కారణమైన వారిపై కఠినంగా వ్యవహరించడంతో తన బాధ్యత పూర్తయిందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. రమేశ్ కుమార్, తనంతట తానుగా కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించడం ఇష్టం లేక రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. యడియూరప్ప బల పరీక్షకు ఈ నెలాఖరు వరకూ గవర్నర్ సమయం ఇచ్చినప్పటికీ, నేడే విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Related posts