అల్లరి నరేష్ నటిస్తున్న కొత్త చిత్రం “నాంది”. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు. నరేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ కానుంది. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ పాత్రలో నటిస్తుంది. హరీష్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.వినూత్న కథతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాజిక అంశాల మేళవింపుతో, క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రమిది. అల్లరి నరేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. ఇది అల్లరి నరేష్ నటిస్తోన్న 57వ చిత్రం. కాగా ఇప్పటికే విడుదలైన ‘నాంది’ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ సినిమాలోని ఒక సీన్ కోసం నరేష్ ఏకంగా నగ్నంగా కూడా నటించాడట. కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ‘నాంది’ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి న్యూ పోస్టర్ విడుదల చేశారు.
previous post