బిగ్ బాస్-14 కంటెస్టెంట్ మరాఠీ భాషను అవమానించేలా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. హౌజ్ కంటెస్టెంట్ నిక్కీ తంబోలి, సింగర్ రాహుల్ వైద్యతో మరాఠీలో మాట్లాడుతుంది. అక్కడే ఉన్న జాన్ కుమార్ ఆమెను మరోసారి మరాఠీలో మాట్లాడవద్దని, అది తనను చికాకుపెడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం, మరాఠీలు జాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట ముఖ్యమత్రి ఉద్ధవ్ ఠాక్రే బిగ్ బాస్ కంటెస్టెంట్ జాన్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిగ్బాస్ హౌజ్కు హెచ్చరిక లేఖ విడుదల చేశారు. భవిష్యత్తులో జాన్ నటించకుండా అతడిపై నిషేధం విధిస్తామని, మరాఠీ బాషను ద్వేషించే వారు ఎవరైన దానికి తగిన ఫలితం చూస్తారని హెచ్చరించారు. కాగా ఇక నిన్నటి (బుధవారం) ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్తో ప్రారంభమైంది. కెప్టెన్సీ టాస్క్ ప్రాసెస్కు ముందు జాన్ కుమార్ సానును బిగ్బాస్ కన్ఫెన్షన్ రూంకు పిలిచారు. ఆ తర్వాత జాన్ కుమార్ తాను మరాఠి భాషపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరాడు. ఎవరీని భాధ పెట్టడం తనకు ఇష్టం లేదని, అవి ఉద్దేశ పూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదన్నాడు. జాన్ కుమార్ మహారాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన వీడియోను రికార్డు చేసి కలర్స్ టీవీ ఛానల్ తన అధికారిక ఇన్స్టా పేజీలో షేర్ చేసింది. అంతేగాక భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, జాన్ వ్యాఖ్యలు టెలికాస్ట్ కాకుండా చూస్తామని పేర్కొంది.
previous post
next post
కమల్ పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు