శాసనసభలో ‘హెరిటేజ్ ఫుడ్స్’పై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ఆరోపణలను హెరిటేజ్ సంస్థ కొట్టిపారేసింది. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది. వ్యాపార విస్తరణలో భాగంగా గుంటూరు చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయాలని 2014 మార్చిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 3నెలలకు జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొంది. కంతేరులో మొత్తం 9.67ఎకరాల భూమి హెరిటేజ్ ఫుడ్స్ పరిధిలో ఉందని.. మొత్తం 3దశల్లో ఈ భూమిని 2014 జులై, ఆగస్టు నెలల్లో కొనుగోలు చేసినట్లు తెలిపింది. హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూమి రాజధాని అమరావతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వం సభలో చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది.
previous post
రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు: దేవినేని