telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను ముట్టుకుంటే.. బ్లాస్ట్ అయిపోతారు… లావణ్య త్రిపాఠి

Lavanya-Tripati

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు ప్రజలు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హీరోయిన్ లావణ్యా త్రిపాఠి అభిమానులతో మాట్లాడింది. “క్విజ్ మీ”లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ‘మీకు మీరే ఒక వార్నింగ్ లేబుల్ ఇచ్చుకోవాల్సి వస్తే.. ఏమని ఇస్తారు?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి లావణ్య స్పందిస్తూ… “నన్ను ముట్టుకుంటే.. బ్లాస్ట్ అయిపోతారు” అనే లేబుల్ ఇస్తాను’ అని చెప్పింది. అలాగే ‘ఎలాంటి సందర్భాల్లో మీకు కోపం ఎక్కువగా వస్తుంది’ అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఎవరైనా చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఆ విషయంలో నాకు సహనం చాలా తక్కువ’ అని చెప్పింది. అలాగే తనకు వ్యాయామం అంటే చాలా ఇష్టమని, ఒక్కరోజు వర్కౌట్ చేయకపోయినా చాలా బాధపడతానని చెప్పుకొచ్చింది.

Related posts