మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రం మరో మైలు రాయిని చేరుకుంది. ఈ చిత్రం విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుని రికార్డును సృష్టించింది. ఈ సందర్బంగా మోహన్ లాల్ తన ట్విట్టర్లో కెరియర్లో సాధించిన విజయవంతమైన చిత్ర పోస్టర్స్తో పాటు లూసిఫర్ పోస్టర్ని జత చేసి షేర్ చేశాడు. లూసిఫర్ చిత్రం విడుదలైన 8 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. లూసిఫర్ ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే 100 కోట్లను వసూలు చేసి, అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. “ఎంపురాన్” అనే టైటిల్తో సీక్వెల్ తెరకెక్కనుందంటూ ఇటీవల టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సీక్వెల్ కూడా పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలోనే తెరకెక్కనుండగా, ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవార్ నిర్మించనున్నారు. మురళీ గోపి చిత్రానికి రచయితగా పని చేయనున్నారు.
previous post
next post
జగన్ కు తమ సహకారం ఉంటుంది: నాగబాబు