తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల “అసురన్” చిత్రంతో భారీ విజయం అందుకున్న ధనుష్ తాజాగా “తూటా” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫలితం మాట ఎలా ఉన్నా… సంక్రాంతికి “పటాస్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో “డీ40” పేరుతో ఓ చిత్రం చేస్తున్న ధనుష్ తాజాగా మారి సెల్వరాజ్ డైరెక్షన్లో మరో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి “కర్ణన్” అనే పేరు పెట్టారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ నటి రజిష విజయన్ కథానాయికగా నటిస్తుంది. చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
previous post