బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న సినిమా చిత్రం ‘అఖండ’. వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది.ఇటీవల విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు అభిమానులకు ఆకట్టుకున్నాయి. తాజాగా ఆదివారం సాయంత్రం సినిమా ట్రైలర్ రిలీజైంది. బాలయ్య డైలాగ్స్కు సోషల్ మీడియాను షేక్ అయిపోయింది.
‘విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు’ అన్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ‘అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్లకాలువ’ అని డైలాగ్ అదిరిపోయింది. ఆశ చచ్చిపోయినప్పుడు, నమ్మకానికి చోటు లేనప్పుడు, విధ్వంస శక్తులు విరుచుకుపడినప్పుడు అఖండ వస్తాడు, కాపాడతాడు అంటూ బాలయ్య అఘోరాగా నటించిన మరో పాత్ర అఖండ పవర్ గురించి చెప్పారు.
” ఒకసారి డైసైడ్ అయి బరిలోకి దిగి దిగితే బ్రేకుల్లేని బుల్ డోజర్ని తొక్కి పార దొబ్బు తా..” అంటూ సాగే మరో మాస్ డైలాగ్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుంది.
‘ఒక మాట నువ్వంటే అది శబ్ధం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం”, మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం, బోత్ ఆర్ నాట్ సేమ్’ అని అఘోరాగా బాలయ్య గర్జించిన డైలాగులు మాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్లో శ్రీకాంత్ మాస్ గెటప్ ఓ రేంజ్లో ఉంది. అలానే జగపతి బాబు ఎలివేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది. జగపతి బాబు చెప్పే కళ్లు తెరిచి జూలు విదిలిస్తే అనే డైలాగ్ కూడా బాగా పండింది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. డిసెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.