తమిళ దర్శకుడు శక్తిచిదంబరం తన ఇంటిలోని చైనా వస్తువులకు నిప్పంటించారు. ఇటీవల లడాక్ వద్ద చైనా సైనికులు భారత సైనికులపై దాడి జరిపినందుకు నిరసనగా ఆయన ఈ చర్యకు పాల్పడ్డారు. చైనా దాడిలో 20 మందికి పైగా భారత సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సంఘటన చిత్రరంగ ప్రముఖుల్లో చైనాపైన, చైనా వస్తువులపై ఆగ్రహం కలిగిస్తోంది. ఇప్పటికీ ప్రముఖ నటి సాక్షి అగర్వాల్ చైనా ఉత్పత్తులను ఇకపై కొనేది లేదని ప్రకటించి టిక్టాక్ అకౌంట్ కూడా రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చార్లీ చాప్లిన్, కోవై బ్రదర్స్, ఇంగ్లీష్ కారన్, మగానడిగన్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన శక్తి చిదంబరం మంగళవారం రాత్రి తన ఇంటిలో ఉన్న చైనాలో తయారైన టేప్ రికార్డర్లు, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కుప్పగా పోసి నిప్పంటించి తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సరిహద్దులో చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడి భారత సైనికులను హతమార్చడం గర్హనీయమన్నారు. చైనాపై ఆర్థిక నిషేధం విధించాలని, ఇకపై దేశంలో చైనా ఉత్పత్తులను ఎవరూ వాడకుండా జాతీయతా భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇకపై తాను చైనా ఉత్పత్తులను కొనేది లేదని శక్తి చిదంబరం తెలిపారు. తమిళ సినీ హాస్యనటుడు యోగిబాబు హీరోగా నటిస్తున్న ‘పేయ్మామా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు శక్తి.
సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ లుక్… ఫుల్లుగా ఎంజాయ్ చేశా అంటున్న లావణ్య