telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇండియన్ క్రికెటర్ ను పెళ్లాడనున్న అనుష్క…?

Anushka

అనుష్క, మాధవన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “నిశ్శబ్దం”. ఈ చిత్రంలో అనుష్క మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తుండగా.. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపి సుందర్ దర్శకత్వం వహించగా.. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా… దక్షిణాదిన మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. 38 సంవత్సరాలున్న ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. త్వరలో నిశ్శబ్దం అనే చిత్రంతో అనుష్క ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే టీమిండియాకు చెందిన ఓ క్రికెటర్‌ను అనుష్క పెళ్లాడబోతుందట. ఆ క్రికెటర్ కుటుంబం దక్షిణాదికి చెందినది కాగా.. వారు ఇప్పుడు ఉత్తరాదిన సెటిల్ అయినట్లు తెలుస్తోంది. నిశ్శబ్దం మూవీ రిలీజ్ తరువాత వీరిద్దరి వివాహం జరగనుందని.. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts