డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘లైగర్. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
ఇందులో అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. లాస్వెగాస్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ క్రమంలోనే షూటింగ్ మధ్యలో కాస్త విరామ సమయం దొరకడం వల్ల సరదాగా గడిపారు విజయ్, అనన్య పాండే. విరిద్దరూ కలిసి గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనన్య. ‘హౌడీరౌడీ’ అని క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఇటీవలే మైక్టైసన్తో విజయ్, అనన్య, పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి దిగిన ఫొటోలను చిత్రబృందం పోస్ట్ చేయగా.. అవి కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.
.