నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన నాగబాబు ఎన్నికల ఫలితాలపై స్పందించారు. నా ఇష్టం పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారంటూ జగన్ కు శుభాభినందనలు తెలియజేశారు. ఏపీలో జగన్ సుపరిపాలన అందించే క్రమంలో తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
జగన్ కు ఏపీ ప్రజలు అద్భుతమైన మెజారిటీ అందించారని అన్నారు. అందుకే జగన్ ప్రజలకు రుణపడి ఉంటారని తెలిపారు. ప్రధానంగా తన ‘నవరత్నాల’ పథకం అమలును జగన్ ఈ ఐదేళ్లలో చేసి చూపించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజల్లో ఆ పథకం అమలు పై నమ్మకం కలిగించాలని అన్నారు.