ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు నీరు అందించడమే తమ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతోందన్నారు.
గోదావరి నీటిని కృష్ణకు తరలించడం ద్వారా నీటి సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. గోదావరిని నీటిని శ్రీశైలంకు తరలించడం ద్వారా రాయలసీమ, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నీటిని అందించవచ్చని చెప్పారు. గోదావరి నీటిని శ్రీశైలంకు తరలింపు అంశంపై అధ్యయనం చేసి నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.