ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న షీలా దీక్షిత్ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలను నిర్వహించారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్ గా కూడా ఆమె పని చేశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. ఆమె మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
జగన్ నామినేషన్లు కూడా తెలంగాణలోనే వేస్తారా?: లోకేశ్