telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్

Atchannaidu tdp

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో పలువురు ప్రజానిధులు కోవిడ్  భారీన పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈఎస్ఐ స్కాం కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నుంచి ఆయన జలుబుతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం ప్రతివారం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టుకు ఆసుపత్రి నివేదిక ఇస్తోంది. ఈ నేపథ్యంలో, అచ్చెన్నకు కరోనా సోకడంపై హైకోర్టుకు లేఖ రాయనున్నారు. రమేశ్ ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అచ్చెన్నాయుడికి కరోనా సోకిందని తెలియడంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Related posts